చాలా మంది సెలబ్రిటీలను నెటిజన్లు సోషల్ మీడియాలో టార్గెట్ గా చేసుకుని ట్రోల్‌ చేస్తుంటారు. లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీల్లో చాలామంది నెటిజన్ల కామెంట్ల పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారు. అయితే కొన్నిసార్లు ఈ  ట్రోలింగ్ బాగా ఓవర్ అయితే కొందరు మాత్రం వాటికి కౌంటర్ లు ఇస్తున్నారు. ఇప్పుడు అలాంటి పని ఇస్మార్ట్‌ శంకర్ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా చేసింది. నాగచైతన్య సవ్యసాచి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఆమె రెండో సినిమాగా అఖిల్ తో మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాలో నటించింది. 


అక్కినేని అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రితో చేసిన ఈ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఇప్పుడు ఆమె ఆశలన్నీ ఈ శుక్రవారం కాబోతున్న రామ్ ఇస్మార్ట్ శంకర్ మీదే ఉన్నాయి. ఈ సినిమా హిట్ అవ్వ‌డం నిధికి త‌ప్ప‌నిసరి. లేకుంటే ఐరెన్‌లెగ్ హీరోయిన్‌గా ఆమెపై ముద్ర‌ప‌డిపోతుంది. ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయిన నేప‌థ్యంలో ఓ నెటిజ‌న్ ఆమె పెట్టిన పోస్ట్ కింద  “ఎక్స్ పోజింగ్ కాకుండా ఇంకా ఏమైనా చేసావా ఈ సినిమాలో?” అంటూ కామెంట్ చేశాడు. 


ఈ కామెంట్‌తో నిధి అగర్వాల్‌కు చిర్రెత్తు కొచ్చిన‌ట్లుంది. దీంతో ఆమె అతడి నోరు మూయించే విధంగా రిప్లై ఇచ్చింది. “యాక్చ్యువల్లీ, చాలా చేశాను. ట్రైలర్ కాదు మూవీ చూడు” అంటూ రిప్లై ఇచ్చింది నిధి అగర్వాల్. దీంతో ఆ నెటీజన్ కూడా సైలెంట్ అయిపోయాడు. మొత్తానికి నిధి గ‌డుసు అమ్మాయే అనిపించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: