సైరా సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను వేగంగా జరుపుకుంటోంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నారు. టీజర్ రిలీజ్ వేడుకను ముంబైలో ఏర్పాటు చేశారు. కాగా, ట్రైలర్, ఆడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్ లు నిర్వహించాల్సి ఉన్నది. ఈ మూడింటిని ఒకే వేదికపై నుంచి ఒకేసారి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు యూనిట్ అంతా హాజరవుతారని సమాచారం. అయితే, నయనతార వస్తుందా రాదా అన్నది తెలియాలి. ఇది వేరే విషయం అనుకోండి. అసలు విషయానికి వస్తే.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను పిలుస్తున్నారని తెలుస్తోంది.
రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్ లు ఒకే వేదికపై ఉంటె అంతకంటే కావాల్సింది ఏముంటుంది. ఇండియన్ స్టార్స్ అందరు ఒకే వేదికపై ఉన్నట్టుగా ఉంటుంది. నిర్మాత రామ్ చరణ్ ఈ విషయంపై ఇప్పటికే రజినీకాంత్ తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. రజినీకాంత్ కూడా అందుకు సరే అన్నారని సమాచారం. దీంతో ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నారు.
అయితే, ఈ ప్రీ రిలీజ్ వేడుక ఎప్పుడు నిర్వహించబోతున్నారు అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. దీని గురించి పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. ప్రస్తుతం దేశంలో సాహో ఫీవర్ నడుస్తోంది. ఈ సినిమా ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ అవుతుంది. ఇది రిలీజైన నెలరోజుల లోపే సైరా రిలీజ్ అవుతుంది. సాహో మానియా తగ్గుముఖం పట్టిన వెంటనే సైరా మానియా మొదలౌతుందన్నమాట.