టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన మాస్ డైరెక్టర్ వివివినాయక్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తబోతున్నారు.  ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోలను నటింపజేసిన ఆయన వెండితెరపై నటించబోతున్నారు.  గతంలో మెగాస్టార్ నటించిన ‘ఠాగూర్’ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించిన వివివినాయక్ ఇప్పుడు హీరోగా నటించబోతున్నాడు. దర్శకుడు నరసింహరావు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి  దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

తన వయసుకు, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో వినాయక్‌ కూడా నటించేందుకు ఓకే చెప్పారట.  కాగా, 1940ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ గా సాగనుంది.  అయితే వివివినాయక్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడో అన్న విషయం పై చర్చలు నడుస్తున్నాయి. ఫైట్, డ్యాన్స్, పంచ్ డైలాగ్స్ ఇలా ఉంటాయా లేదా సైలెంట్ గా కానిచ్చేస్తారా అన్న విషయం పై టాలీవుడ్ లో తెగ చర్చలు నడుస్తున్నాయి.

అయితే 1940ల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఈ సినిమాలో వినాయక్‌ రైతు పాత్రలో కనిపిస్తారని సమాచారం. అలాగే తాతగా,మనవడుగా ఈ సినిమాలో వినాయిక్ డ్యూయిల్ రోల్ లో కనిపిస్తాడంటున్నారు.  ఈ సినిమాని వినాయక్‌ పుట్టినరోజు అయిన అక్టోబర్‌ 9న పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టానున్నారు. ఆ రోజు నుంచే  రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కానుంది. 10 వ తేదీన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారట. 

ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ నటి శ్రియ నటిస్తుందని సమాచారం..కాకపోతే ఈ విషయాన్ని అఫిషియల్ గా ప్రకటించలేదు.  2018లో వచ్చిన ఇంటిలిజెంట్‌ సినిమాకు వినాయక్‌ చివరగా దర్శకత్వం వహించారు. సాయి ధరమ్‌తేజ్‌  హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బొక్కబోర్లా పడింది.  దాంతో చాలా గ్యాప్ తీసుకున్న వివివినాయక్ ఇప్పుడు నటుడిగా అభిమానుల ముందుకు వస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: