మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా  రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం  అక్టోబరు 2న  గాంధీ జయంతి సందర్భంగా  విడుదల కానుంది. ఈ సినిమా కోసం  మెగా అభిమానులంతా  ఎంతో ఆసక్తిగా  ఎదురు చూస్తున్నారు.  ఇప్పటికే చిత్రబృందం ఫుల్ ప్రమోషన్స్ ను మొదలెట్టింది. అందులో భాగంగా   ఆదివారం హైదరాబాద్ లో  ఘనంగా జరగనున్న ప్రీ రిలీజ్ వేడుకతో పాటు  చెన్నైలో, బెంగ‌ళూరులో అలాగే  కొచ్చిలోనూ సైరా టీమ్  కొన్ని ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు.  ఈ ఈవెంట్ లో  ఏ ఒక్క‌దానికి బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, అలాగే నయనతార వచ్చేలా కనిపించడం లేదు. ముఖ్యంగా  అమితాబ్  మాత్రం ఏ  ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం లేదు. అమితాబ్ అనారోగ్య కారణాలు చూపిస్తూ ప్రమోషన్స్ లో పాల్గొనలేనని  సైరా టీంకి ఇప్పటికే చెప్పేశారట.  చివరికీ  ముంబై వేదికగా జరిగిన టీజర్ కార్యక్రమంలో కూడా అమితాబ్ కనిపించలేదు.  ఇక నయనతార పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఒకటి రెండు ఈవెంట్ లకి తప్ప..  తానూ ఎక్కువుగా ప్రమోషన్స్ లో పాల్గొనలేనని  నయనతార ఇప్పటికే స్పష్టం చేసింది. మొత్తానికి సైరాకి వీళ్ళిద్దరూ  తలనొప్పిగా మారారు.  అయితే బాలీవుడ్ లోని కొంతమంది ప్రముఖలకు  సైరా స్పెషల్ షో వేసి.. వారి చేత ప్రమోషన్స్ చేయించుకోవాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ముఖ్యంగా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి అలాగే  అమీర్ ఖాన్ కి మరియు కొంతమంది ప్రముఖలకు  ప్రత్యేకంగా త్వరలో స్పెషల్ షో వేయనున్నారని తెలుస్తోంది.  ఇక చాలా కాలం నుండి సల్మాన్ ఖాన్  సైరా గురించి తన స్పందనను తెలియజేస్తూ ఉన్నారు.  అలాగే  స్టార్ డైరెక్టర్  రాజమౌళికి ప్రత్యేకంగా  స్పెషల్ షో వేయనున్నారు.  రాజమౌళి నుండి ఈ సినిమా అవుట్ ఫుట్ కి  సంబంధించి విలువైన సలహాలను సూచనలను తీసుకోవాలని  సైరా మేకర్స్ భావిస్తున్నారు.  ఇక ఈ చిత్రం  ట్రైలర్  విడుదల అయి.. సంచలనాలను సృష్టిస్తోంది.  భారీ అంచనాలకి తగ్గట్లుగానే భారీ తారాగణంతో భారీ విజువల్స్ తో ట్రైలర్ నెటిజన్లను  బాగా ఆకట్టుకుంది. 


కాగా సైరా విడుదలకు ఇక పదిరోజుల వ్యవధి మాత్రమే ఉంది.  సైరాకు ఉన్న డిమాండ్ రీత్యా ఈ చిత్ర హక్కుల కొరకు డిస్ట్రిబ్యూటర్స్ మధ్య తీవ్ర పోటీనెలకొంది. తెలుగురాష్ట్రాల్లో అతిపెద్ద మార్కెట్ అయిన నైజాం హక్కుల కొరకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీపడుతున్నాయట.  ఇప్పటికే ఈ చిత్ర నైజాం హక్కులు 35 కోట్ల వరకు పలికాయట. అయితే  సైరా మేకర్స్ మాత్రం  40 కోట్లకు నైజాం హక్కులను విక్రయించాలనే ఆలోచనలో ఉన్నారు.  ఇక మెగా అభిమానులు  సినిమాను మరింతగా జనంలోకి తీసుకువెళ్తున్నారు.   సైరాకి పై ప్రేక్షకుల్లో కూడా బాగా ఆసక్తి పెరుగుతుంది.  ఈ టైంలోనే చిత్రబృందం ప్రచారానికి సంబంధించి  ప్రణాళికలను భారీగా ప్లాన్ చేసుకుని..   సినిమాని  మిగిలిన భాషల్లోకి కూడా బాగా తీసుకువెళ్లాలి.  హిందీలో  సైరాకి బజ్ రావాలంటే ఇంకా అక్కడ ప్రమోషన్స్ ను వేగవంతం చెయ్యాలి. పైగా  'వార్' మూవీ, సైరాకి హిందీలో పోటీగా రిలీజ్ అవుతుంది. మరి  ఆ పోటీలో నెగ్గాలంటే ప్రమోషన్స్ బలంగా చెయ్యాలి.  ఈ సినిమాలో  సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క  వంటి స్టార్ లు కూడా  నటిస్తున్నారు.  అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా  సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అందుకే  ఖచ్చితంగా  సైరా మరో సౌత్ బ్లాక్ బ్లాస్టర్ అవుతుందని మెగా ఫ్యాన్స్ షోషల్ మీడియాలో వరుసగా కామెంట్లు పెడుతూ.. సైరా సౌత్ బ్లాక్ బ్లాస్టర్ అని ట్రోల్ చేస్తున్నారు.   ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో  హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న  ఈ చిత్రాన్ని  భారీ స్థాయిలో  విడుదల చేయనున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: