మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రెస్టీజియస్ మూవీ సైరాపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సినిమాలో చిరంజీవి నటనతో వన్ మ్యాన్ షోగా నడిపించాడు. చిరంజీవి నటనకు అభిమానులు గర్వంగా ఫీలవుతుంటే సాధారణ ప్రేక్షకులు ముగ్దులవుతున్నారు. ఎందరెందరో సెలబ్రిటీల నుంచి చిరంజీవి నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సైరాను వీక్షించాల్సిందిగా ఆయన కోరడం జరిగింది. ఇందుకు గవర్నర్ అంగీకరించినట్టు వార్తలు కూడా వచ్చాయి.

 


ఈ వార్తలను నిజం చేస్తూ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నిన్న రాత్రి సైరాను వీక్షించారు. గవర్నర్ కోసం చిరంజీవి ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనకు గవర్నర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. సినిమాను వీక్షించిన అనంతరం ఆమె సైరాపై ప్రశంసలు కురిపించారు. చిరంజీవి నటనను మెచ్చుకుంటూ ప్రత్యేకంగా అభినందించారు. సినిమా టీమ్ కు ఆమె అభినందనలు తెలియజేశారు. ఈ విషయాలను కొణిదెల పీఆర్ఓ తన అఫీషియల్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీంతో చిరంజీవి అభిమానులు సంతోషంతో పొంగిపోతున్నారు. చిరంజీవి కోరిక మేరకు గవర్నర్ హోదాలో సినిమా చూడటం టీమ్ కు గర్వకారణమే అని చెప్పుకోవాలి.

 


తెలుగులో సైరా బ్లాక్ బస్టర్ హిట్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. కన్నడలో కూడా సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. సినిమాకు పండుగ రోజు టెలికాస్ట్ అయిన చిరంజీవి – త్రివిక్రమ్ – రామ్ చరణ్ ఇంటర్వ్యూ కూడా ప్లస్ అయింది. సినిమాలోని డెప్త్ ను ఈ ఇంటర్వ్యూలో బయటకొచ్చినట్టైంది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో చిరంజీవి 152వ సినిమా కూడా పట్టాలెక్కించేశారు. త్వరలోనే షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా వచ్చే వేసవికి విడుదల చేయనున్నారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: