జగన్ సర్కార్ నిర్ణయం అయితే తీసుకుంది కానీ... పనులు మాత్రం ముందుకు సాగలేదు. ఇప్పటికీ అమరావతి నుంచే పరిపాలన కొనసాగుతోంది. అయితే మంత్రులు మాత్రం త్వరలోనే రాజధాని విశాఖకు తరలిపోతుందని ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఓ వైపు న్యాయ పోరాటం చేస్తూనే... నిరసనలో కొనసాగిస్తున్నారు అమరావతి వాసులు. దాదాపు 22 నెలలుగా నిరసనలు చేస్తూన్నా కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో... తమ ఆందోళనను మరింత తీవ్రం చేస్తున్నారు. డిసెంబర్ 17వ తేదీ నాటికి మూడు రాజధానుల ప్రకటన వచ్చి రెండేళ్లు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో మహా పాదయాత్ర నిర్వహించాలని రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ఐక్య కార్యాచరణ సమితీ ఆధ్వర్యంలో నవంబర్ ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. తుళ్లూరు నుంచి తిరుమల వరకు... న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో యాత్ర చేస్తున్నట్లు ఐకాస నేతలు వెల్లడించారు. డిసెంబర్ 17వ తేదీన తిరుమల శ్రీవారికి తమ విన్నపాల లేఖను సమర్పిస్తామన్నారు ఐకాస నేతలు.
జగన్ సర్కార్ నిర్ణయం అయితే తీసుకుంది కానీ... పనులు మాత్రం ముందుకు సాగలేదు. ఇప్పటికీ అమరావతి నుంచే పరిపాలన కొనసాగుతోంది. అయితే మంత్రులు మాత్రం త్వరలోనే రాజధాని విశాఖకు తరలిపోతుందని ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఓ వైపు న్యాయ పోరాటం చేస్తూనే... నిరసనలో కొనసాగిస్తున్నారు అమరావతి వాసులు. దాదాపు 22 నెలలుగా నిరసనలు చేస్తూన్నా కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో... తమ ఆందోళనను మరింత తీవ్రం చేస్తున్నారు. డిసెంబర్ 17వ తేదీ నాటికి మూడు రాజధానుల ప్రకటన వచ్చి రెండేళ్లు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో మహా పాదయాత్ర నిర్వహించాలని రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ఐక్య కార్యాచరణ సమితీ ఆధ్వర్యంలో నవంబర్ ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. తుళ్లూరు నుంచి తిరుమల వరకు... న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో యాత్ర చేస్తున్నట్లు ఐకాస నేతలు వెల్లడించారు. డిసెంబర్ 17వ తేదీన తిరుమల శ్రీవారికి తమ విన్నపాల లేఖను సమర్పిస్తామన్నారు ఐకాస నేతలు.