పార్టీ కార్యాలయంపై దాడిని తీవ్రంగా పరిగణించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు... రాష్ట్ర బంద్నకు పిలుపు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని పార్టీ నేతలకు సూచించారు చంద్రబాబు. ఇంత వరకు బాగానే ఉన్నా... అధినేత తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు రాష్ట్ర పార్టీ కార్యాలయంపైనే దాడి జరిగితే... ఇప్పటిక వరకు కనీసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించలేదు. కనీసం బయటకు రాలేదు. సొంత నియోజకవర్గంలోని కార్యాలయంపైనే దాడి జరిగినప్పటికీ.... లోకేష్ మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు. ఇక బంద్ చేయాలని పిలుపు ఇచ్చిన చంద్రబాబు పరిస్థితి కూడా సేమ్. ధర్నా చేయడం సంగతి పక్కన పెడితే... కనీసం పార్టీ కార్యాలయానికి కూడా చేరుకోలేదు. ఇంటికే పరిమితం అయ్యారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఆవేశంగా మాట్లాడిన చంద్రబాబు... ఇల్లు కూడా దాటకపోవడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పార్టీ కార్యాలయంపై దాడిని తీవ్రంగా పరిగణించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు... రాష్ట్ర బంద్నకు పిలుపు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని పార్టీ నేతలకు సూచించారు చంద్రబాబు. ఇంత వరకు బాగానే ఉన్నా... అధినేత తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు రాష్ట్ర పార్టీ కార్యాలయంపైనే దాడి జరిగితే... ఇప్పటిక వరకు కనీసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించలేదు. కనీసం బయటకు రాలేదు. సొంత నియోజకవర్గంలోని కార్యాలయంపైనే దాడి జరిగినప్పటికీ.... లోకేష్ మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు. ఇక బంద్ చేయాలని పిలుపు ఇచ్చిన చంద్రబాబు పరిస్థితి కూడా సేమ్. ధర్నా చేయడం సంగతి పక్కన పెడితే... కనీసం పార్టీ కార్యాలయానికి కూడా చేరుకోలేదు. ఇంటికే పరిమితం అయ్యారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఆవేశంగా మాట్లాడిన చంద్రబాబు... ఇల్లు కూడా దాటకపోవడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.