కొన్ని నెలల క్రితం
బాలీవుడ్ నటుడు
రాహుల్ బోస్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో రెండు అరటిపండ్లు ఆర్డర్ ఇస్తే హోటల్ సిబ్బంది 442.50 రూపాయల బిల్లు వేశారు. ఈ ఘటన అప్పట్లో వైరల్ అయింది.
గుజరాత్ రాష్ట్రంలోని
అహ్మదాబాద్ నగరంలో అలాంటి ఘటన మరొకటి వెలుగు చూసింది.
బాలీవుడ్ ప్రముఖ
సంగీత దర్శకుడు
శేఖర్ రావూజీ
అహ్మదాబాద్ నగరంలోని హయత్ రెజెన్సీ అనే ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేశాడు.
నిన్న
శేఖర్ రావూజీ మూడు ఉడకబెట్టిన గుడ్లు కావాలని ఆర్డర్ చేశాడు. హోటల్ సిబ్బంది మూడు ఉడకబెట్టిన గుడ్లను
సంగీత దర్శకుడు
శేఖర్ కు ఇచ్చి 1672 రూపాయల బిల్లు ఇచ్చారు. మూడు గుడ్లకు 1672 రూపాయల బిల్లు వేయటంతో బిల్లు చూసిన
శేఖర్ షాక్ కు గురయ్యాడు. ఈ బిల్లు చూసిన
శేఖర్ కు ఏం చేయాలో అర్థం కాక స్టార్ హోటళ్లలో జరుగుతున్న మోసాన్ని బయటపెట్టాలని
శేఖర్ బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
హయత్ రెజెన్సీ ఇచ్చిన బిల్లులో మూడు ఉడికించిన గుడ్లకు 1350 రూపాయలు, సర్వీస్ చార్జీ 67.50 రూపాయలు, సీజీఎస్టీ, ఎస్ జీఎస్టీ కలిపి 255.16 రుపాయలు మొత్తం కలిపి 1672 రూపాయలు చెల్లించాలని బిల్లులో పేర్కొన్నారు. గతంలో
బాలీవుడ్ నటుడు
రాహుల్ బోస్ చంఢీగఢ్ లోని హోటల్ లో దిగి రెండు అరటిపండ్లను ఆర్డర్ చేశాడు. కొంత సమయం తరువాత రెండు అరటిపండ్లను
రాహుల్ కు ఇచ్చి 442.50 రూపాయల బిల్లు చేతిలో పెట్టారు.
బిల్లు చూసి షాక్ అయిన
రాహుల్ హోటల్ బిల్లును
ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. ఈ విషయం తెలియటంతో ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ డిపార్టుమెంట్ వారు హోటల్ రికార్డులను పరిశీలించి రెండు అరటిపండ్లకు 442.50 రూపాయల బిల్లు వేసినందుకు హోటల్ కు 25 వేల రూపాయల జరిమానా విధించారు.