ప్రతి నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే.. ఇలాంటి పరిస్దితుల్లో పాదచారులు అన్ని బండ్లను దాటుకుంటూ వెళ్లాలంటే చాలా కష్టం.. అందుకని పాదచారుల కోసం వేసిన ఫుట్ పాత్ లను కూడా వదలడం లేదు వాహనదారులు.. ఇది కేవలం పూణేలో మాత్రమే జరుగుతున్నది కాదు. దేశంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి.. అందుకని పాదాచారుల కోసం ఫుట్ పాత్లను ఏర్పాటు చేసారు.. అయినా గాని, కాస్త ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే చాలు. వెనుక ఉన్నవాడు బండిని ఫుట్ పాత్ ఎక్కించేస్తాడు. వాడిని చూసి మరొకడు.. అతడిని చూసి ఇంకొకడు ఇది ఎలా ఉంటుదంటే గొర్లమందలా అనిపిస్తుంది..
ఒక గొర్రె ఎటు వెళ్లితే మిగతా అన్ని గొర్రెలు అటువైపే సాగుతాయి. అచ్చం వాహనదారులు కూడా అంతే.. ఇలా ఫుట్ పాత్ లపై బండ్లను నడిపే వారిని ఆపే నాథుడూ లేడు. ఇక ట్రాఫిక్ పోలీస్ ఏమయ్యాడని మీకు అనుమానం రావొచ్చు. ఆ ట్రాఫిక్ పోలీస్ లు ఫుట్ పాత్ పై ఎందుకుంటారు.. ఏ సిగ్నల్ దగ్గరో.. టర్నింగ్ పాయింట్లలోనో, మెయిన్ రోడ్ పక్కనో ఉంటారు.. చలానాలు కట్టించాలి కదా.. అయితే ఇలాంటి పరిస్దితి ఎదురైన ఓ ఆంటీ తన నోటికి పని చెప్పింది..
పూణేలో ఫుట్ పాత్ పై బైక్ లు వెళ్లకుండా ఓ పెద్దావిడ వాహనదారులకు తగిన బుద్ధి చెప్పారు. ఫుట్ పాత్ పైకి బైక్ ఎక్కించి వెళ్లేవారికి అడ్డుగా నిలబడి తిట్ల దండకం మొదలుపెట్టారు. ఆవిడ తిట్లకు బెదిరిపోయిన బైకర్లు.. వెనక్కి తగ్గారు. ఈమెకు తోడుగా మరో ఇద్దరు కూడా తోడైయ్యారు..ఈ సంఘటనను చూసిన వారు వాహనదారులకు ఆంటీ బాగా బుద్ధి చెప్పిందని.. పుణె పోలీసులకు తమ కర్తవ్యాన్ని గుర్తు చేశారని మెచ్చుకున్నారు.
కొందరు గాడ్ బ్లెస్ యూ మేడమ్, ఫుట్పాత్ పై బైక్ నడిపేవారు సిగ్గుపడాలి అని కామెంట్ చేశారు. ఇక మరికొందరైతే ఈ ఆంటీ ముంబైకి వచ్చి మాతో ఉంటే బాగుండనుకుంటున్నారు ముంబై వాసులు. అక్కడ ట్రాఫిక్ ఇందుకు రెండింతలుంటుందిగా మరి. ఒక్క ముంబై ఏంటి.. ఢిల్లీ, హైదరాబాద్ లలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా ఇలాంటి అటం బాంబ్ లాంటి ఆంటీ ఉంటే బాగుండును కనీసం పుట్పాత్లు అయినా పాదాచారుల కోసం ఖాళీగా కనిపించేవి అని అనుకుంటున్నారు ఈ విషయం తెలిసినవారు..