అక్రమ సంబంధం నెపంతో  ఏకంగా కట్టుకున్న వారే కాల యముడు గా మారిపోతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్న విషయం తెలిసిందే. జీవితాంతం ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని చెప్పిన వారే స్వయంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. పరాయి  వ్యక్తుల మోజులో పడి కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా దారుణంగా హత్య చేసిన ఘటనలు ఈ మధ్య కాలంలో తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న దారుణ ఘటనలు  రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఒక మనిషి ప్రాణం తీస్తే శిక్ష పడుతుంది అన్న భయం మాత్రం ఎవ్వరిలో కనిపించడం లేదు.



 ఇటీవలి ఒంగోలు లో కూడా ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ప్రియురాలి మోజులో పడిపోయిన భర్త ఘాతుకా నికి ఒడిగట్టాడు. ప్రియురాలితో సుఖం కోసం భార్య అడ్డుగా ఉందని భావించి ఏకంగా  భార్యను హత్య చేసేందుకు సిద్ధపడ్డాడు. దీనికోసం పక్కా ప్లాన్ వేసి భార్యను హత్య చేయబోయాడు. ఈ ఘటన ఒంగోలులోని శ్రీనగర్ లో చోటుచేసుకుంది. నాదెళ్ల శంకర్ నారాయణ అనే వ్యక్తి హోంగార్డుగా పని చేసేవాడు. ప్రస్తుతం అతన్ని  విధుల నుంచి తొలగించారు.



 ప్రస్తుతం ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి మరో మహిళతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే పూర్తిగా ప్రియురాలి  మోజులో మునిగి పోయాడు శంకర్ నారాయణ. ప్రియురాలితో సుఖానికి కట్టుకున్న భార్య అడ్డు వస్తుందని భావించి ఏకంగా అడ్డు  తొలగించుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే భార్యను కత్తితో పొడిచి చంపేందుకు ప్రయత్నించాడు. వెంటనే గమనించిన బంధువులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది సదరు మహిళ. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకొని నిందితున్ని  అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: