భారతదేశపు అతిపెద్ద పండుగలలో విజయదశమి ఒకటి. ఈ పండగను ఒక్కో రాష్రంలో ఒక్కో పేరుతో పిలిచినా.. నవరాత్రి ప్రత్యేకత మాత్రం చెక్కు చెదరనిది. ఈ నెల 17నుంచి దుర్గా అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ ఉత్సవాల్లో చాల మంది ఉపవాసాలు ఉంటారు. అయితే మీరు కొత్తగా ఉపవాసాలు ఉంటున్నారా ఈ వార్త మీకోసమే.

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ క్లిష్ట సమయంలో రోగ నిరోధక శక్తిని కాపాడుకోవడం చాల అవసరం. అయితే ఉపవాసాల సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఉపవాసాలప్పుడు ఏం తినాలనేదానిపై కచ్చితంగా దృష్టి సారించాలి. తొమ్మిది రోజులపాటు ఆహారం ఏం తీసుకోకుండా నిష్టగా ఉపవాసం ఉండి.. తర్వాత ఆహారం తీసుకుంటే దానికి మన శరీరం ఎలా సహకరిస్తుందనేది సందేహమే మరి.

అయితే కొత్తగా ఉపవాసం చేసేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుని దేవి నవరాత్రులను నిష్టగా ఉండొచ్చు. కఠినంగా ఉండే ఉపవాసాలు చేయకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. అంటే కొంతమంది నీళ్లు కూడా ముట్టుకోకుండా వ్రతం చేస్తుంటారు. అయితే కొత్తగా చేసేవాళ్లు అలా చేయడం మంచిది కాదు. ఈ సమయంలో దానిని చేయకపోవడమే ఉత్తమం. ఈ కరోనా కాలం కాబట్టి రోగనిరోక శక్తిని కాపాడుకోవడం ఎంతో అవసరం. అందుకే మన బాడీని డీ హైడ్రేడ్‌ కాకుండా చూసుకోవాలి.

ఇక పొడి గింజలు పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి అవి మన బాడీకి ఎంతో శక్తినిస్తాయి. ఉపవాసం సమయంలో వీటిని తినొచ్చు. రోజూవారి మీరు తీసుకునే ఆహారంలో.. బాదం, వాల్నట్‌, ఎండు ద్రాక్ష వంటివి ఉండేలా చూసుకోండి. వ్రతం చేసే సమయంలో కుట్టు సాయిదానాతో చేసిన పదార్థాలను తీసుకోండి. అందులో ఉండే హై క్యాలరీలు మీకు ఆకలి కాకుండా నిలువరిస్తాయి.

అయితే ఆకలేస్తుందేమోననే భయంతో అంతా ఒకేసారి తినేయొద్దు. తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్తు తినేలా చూసుకోవడం చాల మంచిది. సహజ పానీయాలు తీసుకోండి. మజ్జిగ, లస్సీ, షెర్బత్‌ లేదా పండ్ల రసాల వంటివి తీసుకుంటే బాడీ డీ హైడ్రేట్‌ కాకుండా ఉంటుంది. అంతేగాక వరీరా నికి అవసర మయ్యే శక్తి కూడా అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: