వైఎస్సార్ పార్టీ ఎంపీ రఘు రామ కృష్ణంరాజు గత కొన్ని రోజుల నుంచి పార్టీకి వ్యతిరేఖంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే..పార్టీలో ఉంటూ సొంత పార్టీపై తీవ్ర ఆరోపణలు చేయడం వైకాపా నేతలకు మింగుడు పడటం లేదు. అతని మాటలను అణచి వేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎంపీ లతో భేటీ అయిన జగన్ ఎంపీ రఘురామ ను పిలవక పోవడంతో తీవ్ర చర్చలకు దారి తీసింది. ఈ విషయం పై ఎంపీ మరోసారి రెచ్చిపోయి తీవ్ర విమర్శలు చేయడంతో పాటుగా పార్టీ అమలు చేస్తున్న పథకాల పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.



ఇది ఇలా ఉండగా ఎంపీ పబ్ లో ఎంజాయ్ చేసిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయిన సంగతి విధితమే.. ఈ విషయం పై స్పందించిన రఘు రామ అది నేనే అని ఒప్పుకున్నారు. ఇతర పార్టీల నాయకుల చేతికి జుట్టును అందించినంత పని అయింది.వైసీపీ ఎంపీ అలా చేస్తున్నా జగన్ పట్టించుకోలేదని ప్రతిపక్షాలు నోరు పారేసుకున్నారు. టిడిపి నేతలు అయితే ఈ విషయాన్ని పదే పదే అంటూ రెచ్చిపోయారు.  ఇప్పుడు మరోసారి ఎంపీ జగన్ పై కక్ష్య సాధించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ సర్కార్ పై మత అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.



ఒకవైపు భారతీయ జనతా పార్టీకి దగ్గరవడం.. మరో పక్కన మత ఉద్ధరణ నాయకుడుగా ప్రజల్లోకి వెళ్లాలని అనుకోవడం  కోణాల్లో ముందుకు సాగుతున్నాడు. ఎసయ్య మరియ తనయ పూర్వా సంధ్య ప్రవర్తతే అనే ఒక శ్లోకాన్ని తయారు చేశారు. అంతేకాదు క్రైస్తవ మత ప్రచారాన్ని అడ్డుకొక పోతే హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతుందని రఘు రామ ఆరోపించారు. వాటితో పాటుగా కార్యక్రమాలను నిర్వహించి, ఒక మతాన్ని ప్రోత్సహిస్తున్న అధికారాన్ని అడ్డుకోవాలని హిందువులను రెచ్చగొడుతున్నారు. హిందూ స్వచ్ఛంద సంస్థలు కోర్టులను ఆశ్రయించాలని చెప్పారు. మొత్తానికి అన్నీ పార్టీలను కవర్ చేస్తూ టీడీపీ లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. చివరికి ఏమౌతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: