రాష్ట్రంలో కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదన్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల నిర్వహణ కష్టమని ప్రభుత్వం నివేదికలో స్పష్టం చేసింది. ప్రతి రోజూ సుమారు 3 వేల కోవిడ్ 19 కేసులు నమోదవుతున్నాయని.. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదముందని పేర్కొంది.
అలాగే ఎన్నికల నిర్వహణకు కీలకమైన ప్రభుత్వ ఉద్యోగులు మరియు పోలీసులు కూడా చాలా మంది కరోనా బారిన పడ్డారని ప్రభుత్వం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోకి రాగానే స్థానిక ఎన్నికలు నిర్వహించాలా లేదా అప్పటి పరిస్థితి బట్టి ఎలా నిర్వహించాలి అనే దానిపై మేము ఈసీని సంప్రదిస్తామని ప్రభుత్వం ఆ నివేదికలో పేర్కొంది .
కరోనా కారణంగా స్థానిక ఎన్నికలను గత మార్చిలో రమేశ్కుమార్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న.నేపథ్యంలో మన ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతివ్వలంటూ దీనిపై ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర హైకోర్టు కమిషనర్ను ఆదేశించింది. ఇప్పట్లో స్థానిక ఎన్నికల నిర్వహణ గురించి పార్టీల అభిప్రాయాలు చాలా ముఖ్యమని అందరి అభిప్రాయాలను గౌరవిస్తామని రమేష్కుమార్ పేర్కొన్నారు.