వారిద్దరూ ప్రేమించుకున్నారు.. కుటుంబ సభ్యుల కు తెలియ కుండా ఎన్నో రోజుల పాటు కలుసుకోవడం మొదలుపెట్టారు. ఏకంగా యువతి అందరు నిద్ర పోగానే ప్రియుడిని అర్ధరాత్రి సమయం లో ఇంటికి పిలిచి మల్లి తెల్లవారు జామున వెనక డోర్ నుంచి పంపించడం కొనసాగించింది. ఇక ఓ రోజు అలికిడి రావడం తో గమనించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు తన గదిలో కూతురు ప్రియుడితో ఏకాంతంగా ఉండటం చూసి జీర్ణించుకోలేక పోయారు. చివరికి సదరు యువకుని గదిలోనే బంధించారు. చివరికి పోలీస్ స్టేషన్లో సదరు యువకుడిపై కేసు కూడా పెట్టారు.



 కానీ అంతలో ఏమైందో కానీ యువకుడు ఊహించని ఘటన మాత్రం చోటు చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ ఆ యువకుడి కె తమ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేందుకు అందరు నిర్ణయించుకోవడంతో ఒక్కసారిగా ఆ యువకుడు షాకయ్యాడు. ఈ ఆసక్తికర ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాంపూర్ పరిధిలో అర్ధరాత్రి సమయంలో ప్రేమ్ సింగ్  అనే యువకుడు ప్రియురాలి ఇంటికి వెళ్లి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఓ  రోజు కుటుంబ సభ్యులు గుర్తించారు. యువకుడిని గదిలో బంధించి చితకబాదారు ఆ తర్వాత పోలీస్ కేసు పెట్టారు.



 దీంతో ఆ రాత్రి అతనికి చివరి రాత్రి అని  యువకుడు భయంతో ఊగిపోయాడు. ఇక చివరికి తెల్లారిన తర్వాత ఊరి పెద్దలు అందరూ కలిసి ఈ విషయంపై చర్చించారు. పోలీస్ స్టేషన్ లో పెద్ద పంచాయితీనే జరిగింది. తర్వాత యువతీ యువకుల తల్లిదండ్రులకు ఊరి పెద్దలు నచ్చజెప్పడంతో చివరికి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అంతే కాదు.. అల్లుడు పై పెట్టిన కేసును కూడా వెంటనే విత్ డ్రా చేసుకున్నారు. ఇక వెంటనే అక్కడ ఓ గుడిలో వారిద్దరికీ పెళ్లి చేశారు. దీంతో ఆ యువకుడు ఒక్కసారిగా షాక్ అయిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: