పోలవరం ప్రాజెక్టు గురించి వివరాలివ్వడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి అనిల్కుమార్ యాదవ్ పలు సందర్భాల్లో అన్నారని, నేను అనేకసార్లు అడిగానని, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించినా చెప్పలేదని వ్యాఖ్యానించారు. 2017 కేబినెట్ నోట్లో ఏముందో బయటపెట్టాలని జలవనరుల శాఖ ప్రస్తుత మంత్రి, మాజీ మంత్రి డిమాండ్ సవాళ్లు చేసుకుంటున్నారని, ఆ నోట్ తన వద్ద ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించిన కేంద్రం.. 2014 ధరల ప్రకారం చేయాలని మాత్రమే చెప్పిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.20వేల కోట్లే ఇస్తామని... ఇక ఇవ్వాల్సింది రూ.7వేల కోట్లే అని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏపీకి లేఖ రాసిందని ఉండవల్లి గుర్తుచేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అవమానకరమని, ప్రాజెక్టు ఎత్తు ఎంతనేది ముఖ్యం కాదని... రిజర్వాయర్లో నీరెంత ఉండాలనేదే ముఖ్యమని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 45 మీటర్ల వరకు కట్టి... గ్రావిటీ ద్వారా నీరిస్తే ఎవరు ప్రశ్నిస్తారని ఉండవల్లి అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఆసియాలోనే ప్రాధాన్యం ఉంది. గోదావరికి మూడుసార్లు వరద వస్తుంది. శబరి, సీలేరు నదుల వల్ల కూడా ఇక్కడ వరద వస్తుంది. నాడు వెంకయ్యనాయుడు వీరోచితంగా పోరాడి రాష్ట్రానికి సాధించిన ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగడం లేదని ఉండవల్లి నిలదీశారు. కేంద్రం ఏపీ అనే బాడీని తీసేసింది... ఇక పోలవరాన్ని రాజ్యాంగ సమస్యగా మార్చండి.. చిన్న కేసులకే కోట్లు ఇచ్చి పెద్ద లాయర్లను నియమిస్తున్నారు. అదంతా వృథా. పోలవరంపై పెద్ద పెద్ద లాయర్లను పెట్టి వాదనలు వినిపించండి అని సూచించారు.
పోలవరం ప్రాజెక్టు గురించి వివరాలివ్వడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి అనిల్కుమార్ యాదవ్ పలు సందర్భాల్లో అన్నారని, నేను అనేకసార్లు అడిగానని, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించినా చెప్పలేదని వ్యాఖ్యానించారు. 2017 కేబినెట్ నోట్లో ఏముందో బయటపెట్టాలని జలవనరుల శాఖ ప్రస్తుత మంత్రి, మాజీ మంత్రి డిమాండ్ సవాళ్లు చేసుకుంటున్నారని, ఆ నోట్ తన వద్ద ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించిన కేంద్రం.. 2014 ధరల ప్రకారం చేయాలని మాత్రమే చెప్పిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.20వేల కోట్లే ఇస్తామని... ఇక ఇవ్వాల్సింది రూ.7వేల కోట్లే అని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏపీకి లేఖ రాసిందని ఉండవల్లి గుర్తుచేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అవమానకరమని, ప్రాజెక్టు ఎత్తు ఎంతనేది ముఖ్యం కాదని... రిజర్వాయర్లో నీరెంత ఉండాలనేదే ముఖ్యమని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 45 మీటర్ల వరకు కట్టి... గ్రావిటీ ద్వారా నీరిస్తే ఎవరు ప్రశ్నిస్తారని ఉండవల్లి అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఆసియాలోనే ప్రాధాన్యం ఉంది. గోదావరికి మూడుసార్లు వరద వస్తుంది. శబరి, సీలేరు నదుల వల్ల కూడా ఇక్కడ వరద వస్తుంది. నాడు వెంకయ్యనాయుడు వీరోచితంగా పోరాడి రాష్ట్రానికి సాధించిన ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగడం లేదని ఉండవల్లి నిలదీశారు. కేంద్రం ఏపీ అనే బాడీని తీసేసింది... ఇక పోలవరాన్ని రాజ్యాంగ సమస్యగా మార్చండి.. చిన్న కేసులకే కోట్లు ఇచ్చి పెద్ద లాయర్లను నియమిస్తున్నారు. అదంతా వృథా. పోలవరంపై పెద్ద పెద్ద లాయర్లను పెట్టి వాదనలు వినిపించండి అని సూచించారు.