ఇదే సమయంలో అటు టీడీపీ నేతలు కూడా జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం స్థానిక సంస్థల నిర్వహించేందుకు సిద్ధమైనప్పటికి కూడా జగన్ సర్కారు ఎన్నికల సంఘానికి సహకరించక పోవడం దారుణం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే... ఓడిపోతామనే భయంతోనే ప్రస్తుతం జగన్ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు రావడంలేదు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు ప్రస్తుతం ప్రతిపక్ష టిడిపి పార్టీ నేతలు.
టిడిపి పార్టీ నేతలు చేసిన విమర్శలపై ఇటీవలే సోషల్ మీడియా వేదికగా స్పందించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి చంద్రబాబు పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వస్తుంది అంటూ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిడిపి ఆరు స్థానాల్లో పోటీ చేస్తే దక్కిన స్థానాలు సున్నా అంటూ ఎద్దేవా చేశారు. కిందటిసారి చంద్రబాబు మద్దతు దారులైన సినీ నటులు ప్రచారం చేస్తే ఒక్కటంటే ఒక్క సీటు గెలిచిందని దీన్ని బట్టి బాబు పార్టీ రోజురోజుకు ఎగబాకుతోందా లేక దిగజారుతున్నదా అర్థం చేసుకోవచ్చు అంటూ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే రిజల్ట్ రిపీట్ అవుతుంది అంటూ వ్యాఖ్యానించారు.