గుడివాడలో కొడాలి నాని అనుచరులు నిర్వహిస్తున్న పేకాట శిబిరాల మీద దాడి చేసిన ఎస్ ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. పిల్లి విజయ్ కుమార్ గుడివాడ టూ టౌన్ ఎస్ఐ గా పని చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆయన ఎస్ఈబీ అధికారులతో కలిసి పేకాట శిబిరాల మీద దాడి చేశారు. అయితే ఆయన అనూహ్యంగా  తన అపార్ట్ మెంట్ లో విజయ్ కుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపడం సంచలనంగా మారింది. అయితే విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. 

విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో, ప్రియురాలు అయిన బ్యూటిషన్ సురేఖ ఫ్లాట్ లోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలో ఈయన హనుమాన్ జంక్షన్ లో పని చేస్తున్న సమయంలో వివాహిత అయిన సురేఖతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో విజయ్ కుమార్ ని సస్పెండ్ చేశారు. అనంతరం ఆయనకు గుడివాడలో పోస్టింగ్ వచ్చింది. అయితే అసలు గుడివాడ స్థానికురాలైన సురేఖ ఏలూరు రోడ్డు లో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసి అది నడుపుతున్నట్టు తెలుస్తోంది. 

అయితే 3 నెలల క్రితం విజయ్ కుమార్ వివాహం చేసుకున్న నేపధ్యంలో భార్యకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోవాలంటూ, విజయ్ కుమార్ పై సురేఖ ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. పెళ్లి విషయమై సురేఖ తరుచూ తనతో గొడవలు పడుతుందంటూ స్నేహితుల వద్ద విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. మొన్న కూడా తను చనిపోతానని ఆమె బాత్రూంలోకి వెళ్లి తలుపు వేసుకోగా ఎన్ని సార్లు తలుపు కొట్టినా తెరవకపోవడంతో భయపడి విజయ్ కుమార్ సూసైడ్ చేసుకున్నాడు. దీంతో బ్యూటీషియన్ సురేఖ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సురేఖను ఈరోజు అరెస్ట్ చేయనున్నట్టు చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: