పోర్న్ గ్రఫీ కేసులో.. బాలీవుడ్ భామ శిల్ప శెట్టి భర్త  ప్రముఖ వ్యాపార వేత్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి మనకు విదితమే. ఈనెల 19వ తారీఖున ఉదయం ముంబై పోలీసులు పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా ను అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది.  రాజ్ కుంద్రా.... చేసిన బాగోతాలు ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు పోలీసులు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా శిల్పా శెట్టి మరియు రాజ్ కుంద్రా లకు మరో ఊహించని షాక్ తగిలింది. శిల్పా శెట్టి మరియు రాజ్ కుంద్రాకు సంబంధించిన సంస్థపై ఏకంగా మూడు లక్షల రూపాయల జరిమానా విధించింది మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.

అంతేకాదు.. ఈ మూడు లక్షల రూపాయలను 45 రోజుల లోపు చెల్లించాలని ఆదేశించింది సెబీ.సెబీ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను శిల్పా శెట్టి మరియు రాజ్ కుంద్రాకు చెందిన వయాన్ ఇండస్ట్రీ పై మూడు లక్షల రూపాయల జరిమానా విధించినట్లు తెలిపింది. అంతేకాదు ఈ వయాన్ ఇండస్ట్రీ కి సంబంధించిన ఉద్యోగులే రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా పోలీసులకు సాక్ష్యం చెప్పారు.  దీంతో రాజ్ కుంద్రా కు.. మరింత ఉచ్చు బిగుసుకుంది.ఇది ఇలా ఉండగా... ఈ ఫోర్ వీడియోల కేసులో ప్రస్తుతం రాజ్ కుంద్రా పోలీసుల రిమాండ్ లో ఉన్నాడు.

ఈ కేసులో బెయిల్ కోసం ప్రయత్నం చేసిన రాజ్ కుంద్రాకు ముంబై కోర్టులోనూ ఎదురుదెబ్బే తగిలింది.  రాజ్ కుంద్రా బెయిల్ ను తిరస్కరించింది కోర్టు. అలాగే గర్యాన్ తోర్పే బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేసింది కోర్టు. అలాగే ఫోర్న్ చిత్రాల తయారీ మరియు ఓన్ లైన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా గత సంవత్సరం ఆగస్టు మాసం, డిసెంబర్ మాసం మధ్యకాలంలో రాజ్ కుంద్రా ఏకంగా 1.17 కోట్లు సంపాదించినట్లు ఈ సందర్భంగా కోర్టు కు వివరించారు ముంబై క్రైమ్ పోలీసులు.  దీంతో రాజ్ కుంద్రా పరిస్థితి  మరింత దారుణంగా తయారైంది. ఇక పోర్న్ గ్రఫీ కేసులో... ఇప్పటికే 11 మందినిఅరెస్టు చేశారు  ముంబాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: