ఓ వైపు పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. బొగ్గు సంక్షోభం అంటే ఏమిటని ఎదురు ప్రశ్నించారు. బొగ్గు కొరత అనే మాటే లేదన్నారు నిర్మలా సీతారామన్. అలాంటి వార్తలే నిరాధారమంటూ కొట్టి పారేశారు నిర్మలా సీతారామన్. ప్రస్తుతం దేశంలో విద్యుత్ కొరత లేదన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి... మిగిలు విద్యుత్ ఉందని వెల్లడించారు. అసలు ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గిందనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశంలో ఉత్పత్తి అనేది పూర్తిస్థాయిలో ఉందన్నారు. కేవలం విద్యుత్ వాడకం పెరగడం వల్ల డిమాండ్ పెరిగిందని.... అందుకే ప్రస్తుతం సంక్షోభం తలెత్తిదన్నారు ఆర్థిక శాఖ మంత్రి. బొగ్గు సరఫరా వ్యవస్థ గతంలో మాదిరే నిరంతరం కొనసాగుతోందన్న నిర్మలా సీతారామన్.... ఎక్కడా దెబ్బ తినేలేదన్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి భారత్లో కొనసాగుతోందన్నారు నిర్మలా సీతారామన్.
ఓ వైపు పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. బొగ్గు సంక్షోభం అంటే ఏమిటని ఎదురు ప్రశ్నించారు. బొగ్గు కొరత అనే మాటే లేదన్నారు నిర్మలా సీతారామన్. అలాంటి వార్తలే నిరాధారమంటూ కొట్టి పారేశారు నిర్మలా సీతారామన్. ప్రస్తుతం దేశంలో విద్యుత్ కొరత లేదన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి... మిగిలు విద్యుత్ ఉందని వెల్లడించారు. అసలు ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గిందనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశంలో ఉత్పత్తి అనేది పూర్తిస్థాయిలో ఉందన్నారు. కేవలం విద్యుత్ వాడకం పెరగడం వల్ల డిమాండ్ పెరిగిందని.... అందుకే ప్రస్తుతం సంక్షోభం తలెత్తిదన్నారు ఆర్థిక శాఖ మంత్రి. బొగ్గు సరఫరా వ్యవస్థ గతంలో మాదిరే నిరంతరం కొనసాగుతోందన్న నిర్మలా సీతారామన్.... ఎక్కడా దెబ్బ తినేలేదన్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి భారత్లో కొనసాగుతోందన్నారు నిర్మలా సీతారామన్.