మంత్రి సురేఖ ఈ విమర్శలను తిప్పికొడుతూ, పార్టీ అధిష్ఠానం సూచనలు ప్రకారం మాత్రమే ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టం చేశారు.నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకు సంబంధించినవని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆయనపై నేరుగా వ్యాఖ్యానించాలనుకోవడం లేదని, అయితే ఈ విషయం బాధ కలిగించిందని ఆమె అన్నారు. మంత్రి హోదాలో ఇద్దరు ధర్మకర్తలను నియమించడం తప్పుకాదని, ధర్మకర్తల కేటాయింపు అధికారం తనకు లేదని చెప్పడం అనుచితమని విమర్శించారు. అధిష్ఠానం నుంచి వచ్చిన పేర్లను భర్తీ చేసినట్లు సురేఖ తెలిపారు. ఈ నియామకాలు ఆలయ అభివృద్ధికి దోహదపడతాయని, ఎమ్మెల్యే వ్యాఖ్యలు పార్టీ ఐక్యతకు ఆటంకం కలిగిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ వివాదం వరంగల్ జిల్లా కాంగ్రెస్లో వర్గ పోరులను మరింత తీవ్రతరం చేస్తోంది.ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయ్యారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఈ మాటలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. నాయిని గెలిచినప్పటికీ, మంత్రి ప్రాంతంలో అభివృద్ధి పనుల్లో తన ప్రమేయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఈ వివాదం పార్టీ అధిష్ఠానానికి కూడా తెలిసింది. మంత్రి సురేఖ ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్కు సమాధానం ఇచ్చారు. ఈ ఘర్షణ భద్రకాళి ఆలయ నిర్వహణకు ప్రభావం చూపకుండా ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి