శ్రియ శరణ్ లీడింగ్ హీరోయిన్ గా తెలుగు తెరను కొన్నేళ్ళ పాటు ఏలింది. ఆమె సక్సెస్ అలా ఇలా కాదు, సౌత్ ఇండియాలోని టాప్ స్టార్స్ తో ఆమె నటించి మెప్పించింది. శ్రియాతో నటించాలని నాటి టాప్ స్టార్స్ కోరుకున్నారంటేనే ఆమె టాలెంట్ అర్ధమవుతుంది. ఇప్పటికీ నాటౌట్ అంటున్న శ్రియా సినీ జీవితం 18 ఏళ్ళు అంటే షాక్ తినాల్సిందే. ఆమె  1982 సెప్టెంబర్ 11 న ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో పుట్టారు. ఆమె చిన్నపుడు జీవితం అంతా హరిద్వార్ లొ గడచింది.


శ్రియా మంచి డ్యాన్సర్ కావాలనుకుంది. అలాగే ఆమె కెరీర్ స్టార్ట్ చేసింది కూడా. కానీ అనుకోకుండా ఆమెకు తెలుగులోనే తొలి చాన్స్ వచ్చింది. ఇష్టం మూవీలో ఆమె నటించింది. ఆ సినిమాలో ముద్దు ముద్దుగా శ్రియా చేసిన అభినయానికి టాలీవుడ్ ఫిదా అయిపోయింది. అప్పటికి ఆమె వయసు 19 ఏళ్ళు. ఆ తరువాత ఏడాది సంతోషం మూవీతో ఆమె కమర్షియల్ హిట్ కొట్టింది. దాంతో ఇక చూసుకోవాల్సిన అవసరం శ్రియకు లేకుండా పోయింది.


శ్రియ మెగాస్టార్  చిరంజీవితో ఠాగూర్ మూవీ చేసి అదరగొట్టింది. అలాగే రజనీకాంత్ తో శివాజీ మూవీ ఆమెకు ల్యాండ్ మార్క్ గా నిలిచింది.  ఇక బాలక్రిష్ణ సరసన‌ చెన్నకేశవరెడ్డితో పాటు, ఆయన వందవ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి, పైసా వసూల్ లో నటించి సరిజోడి అనిపించింది. అదే విధంగా నాగార్జునతో నేనున్నాను, మనం వంటి మూవీస్ చేసింది. వెంకీ సరసన‌ సుభాష్ చంద్రబోస్, గోపాలా గోపాలా మూవీస్ చేసింది.


తొలినాళ్ళతో తరుణ్ తో శ్రియ జట్టు కట్టి చూడ చక్కని జంట అనిపించారు. నువ్వే నువ్వే లో తరుణ్ శ్రియతో చేసిన టీజింగ్ సాంగ్ ఇప్పటికీ అందరికీ గుర్తే. ఇదిలా ఉండగా 2018లో శ్రియ అండ్రూస్ ని పెళ్ళి చేసుకుంది. మంచి పాత్రలు వస్తే నటించేందుకు రెడీ అంటున్న ఈ అందాల బొమ్మ ఇపుడు ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోంది. అందులో ఆమెకు మాటలు లేవు, కేవలం సైగలతోనే పాత్ర ఉంటుందిట. పుట్టిన రోజు సందర్భంగా శ్రియకు ఆల్ ది బెస్ట్ అంటోంది అభిమానజనం.



మరింత సమాచారం తెలుసుకోండి: