దీంతో మిగతా మూడు స్థానాల్లో నిలిచేందుకు ఓటు అన్ని జట్లు కూడా హోరాహోరీగా పోరాడుతున్నాయి. కాగా నేడు మరో ఆసక్తికర మ్యాచ్ జరగబోతోంది. రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. కాగా గతంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగగా రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. చివరిలో నో బాల్ విషయంలో వివాదం కూడా తెరమీదికి వచ్చింది అన్న విషయం తెలిసిందే. దీంతో నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.
కాగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ జట్టు మూడవ స్థానంలో కొనసాగుతోంది. అదేసమయంలో రిషబ్ పంత్ కెప్టెన్సీలోని క్యాపిటల్స్ జట్టు ఐదవ స్థానంలో కొనసాగుతూ ఉండటం గమనార్హం. దీంతో విజయంతో తమ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకునేందుకు ఇరు జట్లు కూడా ఎంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయని చెప్పాలి. కాగా ముంబైలోని డివై పాటిల్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో అన్నదానిపై ప్రస్తుతం ఎన్నో ఊహాగానాలు కూడా తెరమీదికి వస్తూ ఉండటం గమనార్హం..