అయితే 2000 సంవత్సరంలో భారత్ ఇక మహిళా వెయిట్ లిఫ్టింగ్ లో కరణం మల్లేశ్వరి విజయం సాధించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇక ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇక మహిళా వెయిట్ లిఫ్టింగ్ లో ఏకంగా రజత పతకాన్ని సాధించిన మీరాబాయి చాను సరికొత్త చరిత్ర సృష్టించారు. సిల్వర్ మెడల్ సాధించిన మొట్టమొదటి మహిళా అథ్లెట్ల గా రికార్డు సృష్టించారు మీరాబాయి చాను. ఈ క్రమంలోనే ఇక ఈ క్రీడాకారిణి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది అయితే ఇటీవలే మణిపూర్ ప్రభుత్వం పథకాన్ని గెలిచి ఇక భారత గౌరవం నిలబెట్టిన మీరాబాయి చానుకి ఏకంగా కోటి రూపాయల నజరానా ప్రకటించింది అనే విషయం తెలిసిందే.
అంతేకాదు ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తాము అంటూ ప్రకటించింది అయితే సిల్వర్ మెడల్ గెలిచిన మీరా భాయ్ కి ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇటీవలే కన్ఫర్మ్ చేసింది మణిపూర్ ప్రభుత్వం. ఒలంపిక్స్ లో భారతదేశానికి తొలి పథకాన్ని తీసుకొచ్చిన మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఇకనుంచి పోలీస్ గా మారబోతున్నట్లు తెలుస్తుంది. ఇక మణిపూర్ పోలీస్ విభాగంలో మీరాబాయి చాను అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా నియమించాలని ఇటీవలే మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ప్రస్తుతం మీరాబాయి చాను రైల్వే టీసీ గా పనిచేస్తుంది.