నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆటల పండుగ ఒలంపిక్స్ పై ఇటీవలే భారత క్రీడాకారులు అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు  ఎట్టి పరిస్థితుల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి ఒలింపిక్స్లో పతకం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు ఎంతో మంది భారత క్రీడాకారులు. అయితే వరుసగా కొంతమంది భారత అథ్లెట్లు నిరాశపరుస్తున్న సమయంలో 130 కోట్ల భారతీయులు అందరిలో ఉత్సాహాన్ని నింపి గౌరవాన్ని నిలబెట్టింది నిరుపేద కుటుంబానికి చెందిన మీరాబాయి చాను. ఏకంగా మహిళా వెయిట్ లిఫ్టింగ్ లో సిల్వర్ మెడల్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.



 అయితే 2000 సంవత్సరంలో భారత్ ఇక మహిళా వెయిట్ లిఫ్టింగ్ లో కరణం మల్లేశ్వరి విజయం సాధించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇక ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇక మహిళా వెయిట్ లిఫ్టింగ్ లో ఏకంగా రజత పతకాన్ని సాధించిన మీరాబాయి చాను సరికొత్త చరిత్ర సృష్టించారు. సిల్వర్ మెడల్ సాధించిన మొట్టమొదటి మహిళా అథ్లెట్ల గా రికార్డు సృష్టించారు మీరాబాయి చాను. ఈ క్రమంలోనే ఇక ఈ క్రీడాకారిణి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది   అయితే ఇటీవలే మణిపూర్ ప్రభుత్వం  పథకాన్ని గెలిచి ఇక భారత గౌరవం నిలబెట్టిన మీరాబాయి చానుకి ఏకంగా కోటి రూపాయల నజరానా ప్రకటించింది అనే విషయం తెలిసిందే.



 అంతేకాదు ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తాము అంటూ ప్రకటించింది  అయితే సిల్వర్ మెడల్ గెలిచిన మీరా భాయ్ కి ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇటీవలే కన్ఫర్మ్ చేసింది మణిపూర్ ప్రభుత్వం.   ఒలంపిక్స్ లో భారతదేశానికి తొలి పథకాన్ని తీసుకొచ్చిన మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఇకనుంచి పోలీస్ గా మారబోతున్నట్లు తెలుస్తుంది. ఇక మణిపూర్ పోలీస్ విభాగంలో మీరాబాయి చాను అడిషనల్  సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా నియమించాలని ఇటీవలే మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ప్రస్తుతం మీరాబాయి చాను రైల్వే టీసీ గా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: