బుల్లితెరపై క్రేజీ జోడిగా పేరుపొందారు రష్మీ,సుధీర్. ఇక వీరిద్దరూ బుల్లితెరపై ఎంతో క్రేజీ ఉంది. ఎంతోమంది అభిమానులు వీరి కాంబినేషన్ ను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక జబర్దస్త్ లో వీరిద్దరూ కలిసి దాదాపుగా 9 సంవత్సరాల పాటు లవ్ ట్రాక్ నడిపారు. దీంతో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు కూడా బాగా వినిపించాయి. అయితే ఎవరు ఎంత మాట్లాడినా కూడా వీరిద్దరూ వీరి వ్యవహారం గురించి ఓపెన్ కావడం లేదు.


ఇక సుధీర్ రష్మీ జంట పలు స్పెషల్ ఈవెంట్లలో కూడా నటించి మెప్పించారు. రష్మీ హీరోయిన్ గా కూడా పలు చిత్రాలలో నటించింది. కొన్ని చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లు నటిస్తున్నప్పుడు.. జబర్దస్త్ షోలో యాంకర్ గా అవకాశం రావడం జరిగింది. ఇక సుధీర్ కూడా మ్యాజిక్కులు చేస్తూ తన కెరీర్ ని ప్రారంభించాడు ఆ తర్వాత జబర్దస్త్ అవకాశం రావడంతో కమెడియన్ గా మారారు. ఇక ఈ షో లోనే సుదీర్ రష్మి కలుసుకోవడం జరిగింది ఇక అప్పటి నుంచి వీరిద్దరూ ఒక జంటగా మారిపోయారు.

వీరిద్దరూ జబర్దస్త్ వేదికగా వివాహం చేసుకున్నారు. కొంతకాలం సుధీర్ రష్మీ జంట ఎలాంటి షో చేసినా కూడా బాగానే సక్సెస్ అయ్యేది కానీ గత కొద్ది రోజుల నుంచి ఎక్కువగా వీరిద్దరూ జంటగా కనిపించలేదు. అందుకు కారణం సుదీర్ పోస్ట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ సోలో చేయడం జరిగింది కానీ సుదీర్ మానేయడంతో రష్మీ ఇప్పుడు ఈ షోలో యాంకర్ గా చేస్తోంది. ఇది షోలోని హైపర్ ఆది ఇన్ డైరెక్టుగా రష్మీ సుధీర్ పై పంచులు వేయడం జరిగింది. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో హైపర్ ఆది సుధీర్ గురించి మాట్లాడుతూ నువ్వేమైనా మిస్ అవుతున్నావా అని రశ్మిని అడగగా.. రష్మి కాస్త ఎమోషనల్  అవుతూ మనుసులకు దూరానికి సంబంధం ఉండదని అవి ఎక్కడ ఉన్నా సరే కలిసే ఉంటాయని తెలియజేస్తుంది. దీంతో సుధీర్ తో ఉన్న రిలేషన్ పై క్లారిటీ ఇచ్చింది రష్మీ.

మరింత సమాచారం తెలుసుకోండి: