ఇప్పుడు మరోసారి మహాక్షయ్ పై ఇటువంటి ఆరోపణలే చేస్తోంది ఓ మహిళ. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. తనతో శారీరక సంబంధం పెట్టుకొని చివరికి మోసం చేశాడని మహాక్షయ్ పై ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్ లో సదరు మహిళ ఫిర్యాదు చేసింది. తనతో నాలుగేళ్ల పాటు సహజీవనం చేశాడని.. పెళ్లి చేసుకోమని అడిగితే మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. అతని కారణంగా తాను గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించి..
ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదని ఆమె తెలిపింది. మహాక్షయ్ పై కేసు పెడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని.. ఆమె తల్లి యోగితా బాలి బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో మహాక్షయ్, అలానే అతడి తల్లిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఓషివారా పోలీసులు చెబుతున్నారు.ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇలాంటి వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.