పంజాబీ చిత్రాలలో చేసిన తరువాత, పాయల్ rx100 చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ చిత్రానికి గాను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే అతి పెద్ద సైమా అవార్డును అందుకున్నారు. 'RX 100'తో స్టార్డమ్ని పెంచుకోవడానికి ముందు, పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్పుత్ దాదాపు ఏడేళ్ల పాటు షోబిజ్ ప్రపంచంలో కష్టపడి చెమటోడ్చింది. ముంబైలో ఆమె ప్రారంభ రోజుల్లో, ఆమె అనేక హిందీ టీవీ సీరియల్స్లో సహాయక పాత్రలు పోషించింది. చివరికి 2017లో మరాఠీ బ్లాక్బస్టర్ 'సైరాట్'కి రీమేక్ అయిన పంజాబీ చిత్రం 'చన్నా మెరేయా'తో వెండి తెర అరంగేట్రం చేసింది. ఆ తరువాత తెలుగులో 'డిస్కో రాజా', వెంకీ మామ, 3 రోజెస్ వంటి సినిమాల్లో ఆకట్టుకునే నటన కనబరిచింది.
పాయల్ సీరియల్స్ విషయానికొస్తే... 'సప్నోన్ సే భరే నైనా', 'గుస్తఖ్ దిల్', 'మహా కుంభ్ ఏక్ రహస్య', 'ఏక్ కహానీ' వంటి ప్రసిద్ధ టీవీ సీరియల్స్లో చేసిందని సౌత్ లో చాలా మందికి తెలియదు. సోషల్ మీడియాలో పాయల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉంది. పాయల్ను ఇన్స్టాగ్రామ్లో 27 లక్షల మంది ఫాలో అవుతున్నారు. పాయల్ స్టైలింగ్, దుస్తులపై కూడా ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు. విశేషమేమిటంటే పాయల్ 2018లో హిందీ సినిమా ల్లోకి అడుగు పెట్టింది. ఆమె మొదటి చిత్రం జిమ్మీ షెర్గిల్, కృతి కర్బందా, పుల్కిత్ సామ్రాట్ నటించిన 'వీరే కి వెడ్డింగ్'.