నేటి తరం టీం ఇండియా ఆటగాళ్ళలో మంచి ఫీల్డర్ ఎవరు అనగానే వినపడే ప్రశ్న టీం ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. చాలా మంది అతని ఫీల్డింగ్ చూసి జాంటీ రోడ్స్ తో పోల్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక టీం ఇండియా లో ఆ స్థాయిలో ఫీల్డింగ్ చేసే ఆటగాళ్ళు ఈ తరంలో చాలా తక్కువగానే ఉన్నారు. 

 

ఇది ఇలా ఉంటే ఇప్పుడు స్టార్‌స్పోర్ట్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకవేళ మీకు అవకాశమిస్తే డైరెక్ట్‌ త్రో ద్వారా స్టంప్స్‌ను ఎగురగొట్టడంలో విరాట్‌ లేదా జడేజాలో ఎవరిని ఏంచుకుంటారని  ఒక ప్రశ్న వేసింది.  దీనికి స్పందించిన కోహ్లీ... అందులో ఏ సందేహం అవసరం లేదు. ప్రతీ సారి జడ్డూ నే అత్యుత్తమ ఫీల్డర్ ఈ విషయాన్ని ఇక్కడి తో వదిలేద్దాం అంటూ కామెంట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: