మెగా స్టార్ చిరంజీవి తన పర్సనల్ లైఫ్ లో చాలా ముభావముగా ఉంటారు. తాను ఎక్కడున్నా ఆడంబరాలకు చాలా దూరంగా ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘ రాజకీయాల అనంతరం ఖైదీ 150 తో రీ-ఎంట్రీ ఇచ్చి తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు...ఆఫ్టర్ లాంగ్ టైం బాస్ ఈస్ బ్యాక్ అంటూ అదరగొట్టారు చిరంజీవి. ఆతరువాత చిరు చేసిన సైరా ..నరసింహారెడ్డి చిత్రం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల మోత మోగించింది. ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వం లో 152 వ సినిమా చేస్తున్నాడు.
అయితే లాక్ డౌన్ కావడంతో షూటింగ్ కాస్త విరామంలో పడింది. ఈ విరామ సమయాన్ని చిరు తన సోషల్ మీడియా లో గడుపుతున్నారు. మొదట్లో సోషల్ మీడియా కు దూరంగా ఉన్న చిరు లాక్ డౌన్ తరువాత సోషల్ మీడియాలో యాక్టీవ్ గా పాల్గొంటున్నాడు. పోయిన మార్చ్ లో మెగాస్టార్ ట్విట్టర్ లో జాయిన్ అవ్వగా ప్రస్తుతం 507.5K ఫాలోవర్లని సొంతం చేసుకున్నారు. అదేవిధంగా రామ్ చరణ్ కూడా మెగాస్టార్ తో కలసి ఒకే సారి ట్విట్టర్ ఖాతాలను తెరువగా ఆయనకూడా 502.6K ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నారు. వీరికంటే ముందుగా 2014 ఆగస్టు లో జాయిన్ అయిన పవన్ కళ్యాణ్ 3.9M ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నాడు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరు అభిమానులకు కృతజ్ఞతలను తెలియజేశారు.
Congratulations my Boy @RanaDaggubati Finally the mighty #BhallalaDeva is struck by #Cupid & Getting hitched. #Lockdown leads to #WedLock. god Bless You Both! శతమానం భవతి. @MiheekaBajaj pic.twitter.com/fDdHbjhivz
— chiranjeevi konidela (@KChiruTweets) May 12, 2020
Throwback to #Dhruva shoot. Can't wait to be back on sets. Till then, stay home and stay safe. pic.twitter.com/ZlaHcad8jn
— ram charan (@AlwaysRamCharan) May 16, 2020