జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిల అరెస్ట్‌పై టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేసారు. బీసీ నేత అచ్చెన్నాయుడి అక్రమ అరెస్ట్‌ను పక్కదారి పట్టించేందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిను అరెస్ట్ చేశారని ఈ సందర్భంగా లోకేష్ మండిపడ్డారు. 

 

16 నెలల జైలు పక్షి, లక్ష కోట్ల దోపిడీదారు, 11 కేసుల్లో ఏ1 నిందితుడు జగన్‌రెడ్డి అంటూ...  టీడీపీ నాయకుల్ని జైల్లో పెట్టి రాక్షస ఆనందం పొందాలనుకుంటున్నారని ఈ సందర్భంగా ఆరోపణలు చేసారు. ఏడాది పాలనలో జగన్ ఒక చేతగాని ముఖ్యమంత్రి అనే విషయం ప్రజలకు అర్థమైంది అంటూ విమర్శలు చేసారు ఆయన. రాజారెడ్డి రాజ్యాంగంలో వేధింపుల పర్వానికి తెర లేపారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: