విశాఖలో కట్టడి అయింది అని భావించిన కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి విశాఖలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక విశాఖలో ఇప్పటి వరకు 400 పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఒక్క రోజే 35 కేసులు నమోదు అయ్యాయి. వైరస్‌కు అడ్డాగా మారిన అప్పుఘర్‌ ప్రాంతంలో మరో 14 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 

 

నిన్న ఒకరు కరోనాతో మరణించారు. ఇక  మొత్తం ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఇక్కడ కరోనా పరీక్షలను వేగంగా చెయ్యాలి అని ఆదేశాలు వచ్చాయి. కరోనా పరిక్షలు చేస్తే కరోనా వైరస్ ని కట్టడి చేయడం సాధ్యం అవుతుంది అంటూ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కేసులు ఉన్న ప్రాంతంలో అందరికి కరోనా పరిక్షలు చెయ్యాలి అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: