కరోనా మందు కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నాయో అందరికి తెలిసిందే. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా ఫలితం లేకపోవడంతో మందు కోసమే ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ కి చెందిన పతంజలి సంస్థ ఒక మందు విడుదల చేసింది. 

 

క్లినికల్ కంట్రోల్ స్టడీ, క్లినికల్ కంట్రోల్ ట్రయల్ చేరి కోరోనిల్ అనే ఒక మందుని విడుదల చేసింది సంస్థ. రాజస్థాన్ జైపూర్ నిమ్స్ వైద్యులతో పాటు పలువురు శాస్త్త్రవేత్తల సహకారంతో 150కి పైగా ఔషద మొక్కలను వాడి తయారు చేసారు ఈ మందు. ఇది వాడితే రెండు వారాల్లో కరోనా తగ్గిపోతుంది అని సంస్థ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: