గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకు వస్తూ ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం కరోనా కష్టాలు ఉన్నా ప్రజల సౌకర్యార్థం 108,104 వాహనాలను ప్రవేశపెట్టి విషయం తెలిసిందే. ఏపీలో 1,088 అంబులెన్సులను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. విజయవాడలో ఈ వాహనాలను ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అవన్నీ విజయవాడ నుంచి జిల్లాలకు పయనమయ్యాయి.
ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వైఎస్ జగన్ పై ప్రశంసల జల్లులు కురిపించారు. తాజాగా ప్రపంచమంతా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న సమయంలో... ఏపీ ప్రభుత్వం 108,104 వాహనాలను ప్రవేశపెట్టిందని దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రశంసించారు. హ్యాట్సాఫ్ జగన్ గారూ అంటూ కొనియాడారు. సంగీత దర్శకుడు తమన్ కూడా ప్రశంసించారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీనుంచి పలువురు సెలబ్రెటీలు వైఎస్ జగన్ చేస్తున్న మంచిపనులకు కితాబు ఇచ్చారు.
While the world is battling with corona crises ,
— PURIJAGAN (@purijagan) July 1, 2020
Hats off to @ysjagan garu to arrange a fleet of ‘108,104’ ambulances in urban n rural areas of ap for emergencies, accidents , disasters and serious alignments . Huge respect sir 🙏🏻 #Corona #YSJaganCares pic.twitter.com/otNuEELHQD