ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్రంలో 26 మంది డిప్యూటీ కలెక్టర్లను ఏపీ సర్కార్ బదిలీ చేసింది. శ్రీకాళహస్తి ఆలయం ఈవో గా డి.పెద్ది రాజు ని ఏపీ సర్కార్ నియమించింది. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈవో గా కిరణ్ కుమార్ ని ఏపీ సర్కార్ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ ఈవో గా డి.వెంకటేశ్వర రావు ని నియమించింది ఏపీ సర్కార్.

తూర్పుగోదావరి జెడ్పీ సీఈవో గా ఎన్వీవీ సత్యనారాయణను నియమించారు. గుంటూరు డీఆర్వో గా సి.చంద్ర శేఖర్ రెడ్డి ని ఏపీ సర్కార్ నియమించింది. నెల్లూరు జిల్లా ఆసరా ,సంక్షేమం జేసీ గా జె. శివ శ్రీనివాస్ ని ఏపీ సర్కార్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు త్వరలో బాధ్యతలు చేపడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: