తెలంగాణాలో అధికార పార్టీ నేతలను కరోనా వైరస్ చాలా ఇబ్బంది పెడుతుంది.  కరోనా కట్టడిలో కష్టపడుతున్న వారిని కూడా కరోనా వేధించడం ఆందోళన కలిగిస్తుంది. ఇక తాజాగా మాజీ హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని తెలంగాణా ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావుతో పాటుగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు.

నాయిని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లని అడిగి తెలుసుకున్న మంత్రి హరీష్ రావు.. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను హరీష్ రావు విజ్ఞప్తి చేసారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించడంతో పాటుగా వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు ఆయన. ఇక ఆయన అల్లుడు, కూతురుకి కూడా కరోనా వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: