తెలంగాణాలో రైతులు ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. తాజాగా నేడు చలో జగిత్యాలకు పిలుపు ఇచ్చారు రైతు సంఘం నేతలు. మక్కలకు, సన్నరకం ధాన్యం కు కనీస మద్దతు ధర డిమాండ్ చేస్తూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. జిల్లాలో భారీగా పోలీసులు కూడా మొహరించారు. రైతు ఐక్య వేదిక నేతలను అరెస్టు చేసారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ని అరెస్ట్ చేసారు.

 జగిత్యాలలో రైతుల అరెస్టులను ఖండిస్తున్నాం అని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల అక్రమ అరెస్టులు పిరికిపంద చర్యలు అని ఆరోపించారు. మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలి అని కోరుతున్నారు.  డిమాండ్ల సాధన కోసం ర్యాలీ చేస్తే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని గృహ నిర్బంధం చేసారు. చలో జగిత్యాల కు వెళ్తారని ముందస్తుగా పోలీసులు ఆయన ఇంటి వద్ద మొహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: