ఆంధ్రప్రదేశ్ లో ఏ సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెట్టినా సరే విపక్షాలు టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కూడా కరోనా తీవ్రత అధికంగా ఉన్నా సరే సంక్షేమ కార్యక్రమాలు మాత్రం చాలా వేగంగా అమలు చేస్తుంటే ఏదోక రూపంలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు.

విమర్శలు నమ్మశక్యంగా, వాస్తవాలకు దగ్గరగా ఉండాలనే లాజిక్ ను చంద్రబాబు గారు ఎప్పుడో గాలికొదిలారు అని ఆయన ఆరోపించారు. సిఎంగా జగన్ గారు చేసింది శూన్యమంట... ఈయన పథకాలనే పేరు మార్చి అమలు చేస్తున్నాడట... గ్రాఫిక్స్ హోరు తప్ప తమరు పెట్టిన నాలుగు వెల్ఫేర్ స్కీముల పేర్లు చెప్పండి బాబూ? అని సవాల్ చేసారు. తాజాగా వైఎస్సార్ బీమా విషయంలో విపక్షాలు చంద్రన్న బీమాతో పోల్చుతూ వ్యాఖ్యలు చేసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: