దుబ్బాక ఉప ఎన్నికలు  దగ్గరకు వస్తున్న తరుణంలో ఇప్పుడు బిజెపికి అక్కడ అన్నీ వరుసగా ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ఏదోక ఇబ్బంది ఆ పార్టీకి అక్కడ ఎదురు అవుతూనే ఉంది. తాజాగా మరోసారి దుబ్బాక బిజెపి అభ్యర్ధిని  పోలీసులు టార్గెట్ చేసారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి బంధువుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు చేసారు. సిద్దిపేటలో రఘునందన్‌ రావు అత్తారిళ్లు, బంధువుల ఇళ్లలో సోదాలు చేసారు.

మొత్తం 8 చోట్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేసారు పోలీసులు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆయన డబ్బులు పంచడానికి రెడీ అయ్యారు అని ఆరోపణలు చేస్తుంది అధికార పార్టీ. దీనితో ఆయన ఇంటి మీద దాడులు చేసారు. ఇప్పటికే ఆయన ఒకసారి డబ్బులతో పట్టుబడ్డారు అనే ఆరోపణలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. నవంబర్ 3 న ఎన్నికలు జరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: