గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు చాలా వరకు బిజెపి నేతలు దూకుడుగానే వెళ్తున్నారు. ప్రచారం విషయంలో చాలా అప్రమత్తంగా ఉంది బిజెపి. ఇక తాజాగా కీలక నేతలు కూడా హైదరాబాద్ లో ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు. నేడు హైదరాబాద్ కు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రానున్నారు. 11 గంలకు బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కేంద్రమంత్రి మాట్లాడే అవకాశం ఉంది.

రేపు బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేస్తారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ మ్యానిఫెస్టోను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవిస్ విడుదల చేస్తారు. శుక్రవారం గ్రేటర్ ఎన్నికల్లో గౌతమ్ గంభీర్, కుష్భు ప్రచారం చేస్తారు. అమిత్ షా, జెపి నడ్డా, సిఎం యోగి ఆదిత్యానాథ్ లను ప్రచారానికి ఆహ్వానించిన తెలంగాణ బీజేపీ నాయకత్వం... ఇప్పటికే వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: