గ్రేటర్ హైదరాబాద్ లో ప్రచారం చేసే విషయంలో బిజెపి నేతలు కాస్త దూకుడుగా ఉన్నారు. జాతీయ స్థాయి నేతలు ప్రచారానికి వస్తున్నారు. అగ్ర నేతలతో పాటుగా సిఎంలను మాజీ సిఎంలను ఇప్పుడు రంగంలోకి దింపుతుంది బిజెపి అధిష్టానం. భారీ ఎత్తున ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో కేంద్ర మంత్రులు ఉన్న సంగతి తెలిసిందే. రేపు హైదరాబాద్  కు బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ వస్తున్నారు అని బిజెపి నేతలు ప్రకటించారు.

అమీర్ పేట్ , బేగంపేట్, అల్వాల్లో రోడ్ షోలు చేయనున్నారు వనతి శ్రీనివాసన్. గురువారం తమిళ సంఘాల ప్రతినిధులతో మహిళా మోర్చా అధ్యక్షురాలు భేటీ అవుతారు. గురువారం సాయంత్రం వివిధ ప్రాంతాల్లో రోడ్ షోలు చేయడానికి ఆమె రెడీ అయ్యారు. త్వరలోనే మరికొంత మంది నేతలు ప్రచారానికి వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: