బల్కంపేట్ రోడ్ షోలో బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ పోల్చిన బండి సంజయ్... పివి సమాధి,  ఎన్టీఆర్ ఘాట్ ను కూల్చాలన్న అక్బరుద్దీన్ ఓవైసీ మాటలను తప్పుపట్టారు. దమ్ముంటే కూల్చాలి అని సవాల్ విసిరారు. ఎన్టీఆర్ ఘాట్, పివి ఘాట్ ను కూల్చిన మరుక్షణం దారుస్సలాం ను కులుస్తామంటూ హెచ్చరించారు బండి సంజయ్. 

బర్కత్ పురా ఎమ్మెల్యే సవాల్ ను  సీఎం కేసీఆర్ స్వీకరించాలి  అని ఆయన  పేర్కొన్నారు. పాత బస్తీ వెళ్లి  కరెంటు బిల్లు, నీళ్ల బిల్లు  వసూలు చేయాలి అని వ్యాఖ్యలు చేసారు. సీఎం కేసీఆర్ పాతబస్తీ రావాలంటే ఓవైసీ పర్మిషన్ తీసుకోవాలని చార్మినార్ ఎమ్మెల్యే అంటున్నాడు  అని... పాతబస్తీ పోవాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వణుకు పుడుతుంది అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు కాస్త దుమారం రేపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: