సాధారణంగా ఒక మనిషి చనిపోతే మిగతా మనుషులు బాధ పడతారో లేదో తెలియదుగానీ జంతువులు మాత్రం తమ గుంపులో ఒక జంతువు మరణిస్తే దాని చుట్టూ చేరి బాధ పడుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం కోతి గుట్ట వద్ద నిన్న ఒక ఏనుగు కరెంట్ షాక్ కు గురై మృతి చెందింది. 

దీంతో ఏనుగు మృతి చెందిన ప్రాంతానికి ఈ ఉదయం భారీ సంఖ్యలో ఏనుగుల గుంపు వచ్చి చేరింది. తమలో ఒక జంతువు చనిపోవడంతో భారీ ఎత్తున ఘీంకారాలు చేస్తూ సుమారు 20 కి పైగా ఏనుగుల గుంపు అక్కడ మోహరించింది. వాటిని చూడడానికి వచ్చిన జనం మీదకు కూడా ఒకానొక దశలో దూసుకువెళ్లాయి. అలా వెళ్ళిన సమయంలో ఒక వ్యక్తి వాటికి బలయ్యేవాడు, కానీ త్రుటిలో తప్పించుకుని బయటపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: