ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించారు.
ఉత్తర ప్రదేశ్‌లోని లఖ్‌నవూ-అయోధ్య జాతీయ రహదారిపై గత అర్ధరాత్రి ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ డబుల్ డెక్కర్ బస్సును ట్రక్టు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది కన్నుమూయగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలు, గాయపడిన వారితో ఘటనాస్థలి భీతావహంగా కనిపించింది.

గాయపడిన 15 మందిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లా రాంస్నేహిఘాట్‌ ప్రాంతంలో ఈ దారుణ రోడ్డు ప్రమాదం ఘటన జరిగింది. హర్యానా నుంచి బీహార్‌ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సును ట్రక్కు ఢీ కొనట్టు స్థానికులు చెబుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: