కొద్ది రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే, ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో ఇవాళ రేపు ఆయన డిశ్చార్జ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆయన హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ ఒకటో తేదీన రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే చిరంజీవి చేతుల మీదుగా విడుదల కాగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇక ఈ సినిమా విషయంలో సాయి ధరమ్ తేజ్ కి ఆయన చిన్న మేనమామ పవన్ కళ్యాణ్ అండగా నిలబడుతున్నారు.  సెప్టెంబర్ 25వ తేదీన జరగబోతున్న రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఈవెంట్కు సాయి ధరంతేజ్ చేత ఒక స్పెషల్ వీడియో బయట కూడా చేయించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: