ఏపీలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. ఇక అబ్బాయిల వలలో చిక్కి అమ్మాయిల నిండు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పిన వారిని నమ్మి అందుకు అంగీకరిస్తే.. కోరికలు తీర్చుకుని మొహం పెళ్లికి చాటేస్తున్నారు. అంతటితో ఆగకుండా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఇదే తరుణంలో ఘటన చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లాలోని బద్వేలు మండలం చింతలచెరువుకి చెందిన 19 ఏళ్ల యువతీ డిగ్రీ చేస్తుంది. అయితే యువతీ ఒక్క అబ్బాయిని ప్రేమించాడంటూ వెంటబడ్డాడు. అయితే ఆమె అతడి ప్రేమకి అంగీకారం తెలుపలేదు. అయితే తీవ్ర కోపోద్రిక్తుడైన యువకుడు అతి కిరాతకంగా యువతి గొంతు కోశారు. ఈ విషయం గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

పోలీసులు అమ్మాయిల స్నేహితుల నుండి వివరాలు తెలుసుకున్నారు. ఇక ఇద్దరి మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారానికి సంబంధించి వివాదం ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ ఘాతుకానికి ఇదే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిందితుడు చరణ్‌ను గ్రామస్తులు పట్టుకుని చితకొట్టాడు కొట్టారు. అయితే తీవ్రంగా గాయపడ్డ నిందితుడు ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇక ఈ ఘటన జరిగిన తరువాత చరణ్ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం. అయితే నిందితుడు చరణ్ పట్టుకుని గ్రామస్తులు, యువతి బంధువులు చితకబాదారారు. అనంతరం తరువాత పోలీసులకు అప్పగించారు. అయితే తీవ్ర గాయాలతో ఉన్న ఆ ప్రేమోన్మాదిని బద్వేల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం పోలీసుల అదుపులోనే చరణ్ ఉన్నట్లు సమాచారం. అయితే శిరీష మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: