ఇండియాలో కేంద్ర ప్రభుత్వం ఇ-సిగరెట్స్‌పై నిషేదం విధించింది....దీంతో చాలామంది ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ట్రోల్ చేస్తున్నారు. పొగాకు ఉత్పత్తులు కూడా ప్రాణానికి హాని చేసేవే....అయితే, వాటి వల్ల మరణం ఆలస్యం కావచ్చు. కానీ,ఇ-సిగరెట్లు రోజుల వ్యవధిలోనే ప్రాణాలను హరిస్తున్నాయి.   నికోటిన్ తదితర రసాయనాలతో తయారు చేసిన ద్రవాన్ని నింపిన పెన్నులాగా ఉండే ఎలక్ట్రిక్ పరికరాన్ని ఈ-సిగరెట్ అంటారు.ఓ 4 గంటలు ఛార్జింగ్ పెడితే గంట సేపు పనిచేసే ఈ  ఇ-సిగరెట్స్‌ లో పొగాకు బదులు వేప్ ఆయిల్ ఉపయోగిస్తారు.


ఇందులో ఉండే నికోటిన్.. 20 సిగరెట్లలో ఉండే నికోటిన్‌తో సమానంగా ఉంటుంది. ఇవి రకరకాల ఫేవర్(రుచి/వాసన)లలో లభిస్తాయి.  ఇ-సిగరెట్‌లోని నికోటిన్ ద్రవం పొగలా మారి సిగరెట్ తాగుతున్న అనుభూతిని ఇస్తుంది.  సిగరెట్లతో పోల్చితే ఇది అంత ప్రమాదకరం కాదనే ప్రచారంతో అంతా ఇ-సిగరెట్ల వైపు మొగ్గుతున్నారు.  వాస్తవానికి ఇది కూడా ప్రమాదకరమే. ఇందులో నుంచి వచ్చే పొగ ఊపిరితీత్తుల్లో తిష్ట వేసి ప్రాణాంతకంగా మారుతోంది. ఇండియాలో 460 ఇ-సిగరెట్ బ్రాండ్లు.. 7,700 ఫ్లేవర్స్‌లో లభిస్తున్నట్లు తెలిసింది. ఈ ఫ్లేవర్లకు యువత బానిస అవుతున్నారు.

పెన్సిల్వేనియాకు చెందిన ఆంథోనీ మాయో అనే 19 ఏళ్ల యువకుడు రెండేళ్ల నుంచి ఇ-సిగరెట్స్ తాగుతున్నా డు.  ఇటీవల రెసబెర్రీ, సెడిష్ ఫీష్, కాటన్ క్యాండీ, కిన్నామన్ టోస్ట్ క్రంచ్ వంటి కొత్త ఫ్లేవర్లు అలవాటు చేసుకున్నాడు. అవి తాగిన తర్వాత   దగ్గు ఎక్కువగా వస్తూ ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడ్డాడు. దీంతో ఆంథోనీ తండ్రి కీత్ వెంటనే అతడిని హాస్పిటల్‌లో చేర్చాడు. కానీ అది సాధారణ దగ్గు అనుకుని వైద్యులు యాంటిబయోటిక్స్ రాసి పంపారు. ఆ తర్వాత కూడా దగ్గు తగ్గక ఊపిరి పీల్చుకోడానికి ఇబ్బందిపడటంతో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఎక్స్‌రే రిపోర్టులు చూసి షాకయ్యారు. 

అతడి ఊపిరితీత్తుల్లో పొగ నిండిపోయింది. అతగు తీసుకుంటున్న వేప్ ఆయిల్ ఊపిరితీత్తుల్లోన్ని మూలల్లోకి చేరి గడ్డ కట్టేసింది. దీని వల్ల ఊపిరితీత్తులు రాయిలా మారాటంతో అతను ఊపిరి పీల్చుకోలేక ఇబ్బందిపడ్డాడని వైద్యులు తెలిపారు.  అతడికి ఆక్సిజన్ అందించడం ద్వారా ఊపిరితీత్తుల్లో పేరుకున్న ఆయిల్‌ను కొంత వరకు వెలికి తీశామన్నారు.  ఊపిరితీత్తుల్లో గాలికి మాత్రమే చోటివ్వాలని, తేమ లేదా ఆయిల్ వంటివి పీల్చితే ప్రాణానికే నష్టమని అంటున్నారు డాక్టర్లు. ఇ-సిగరెట్స్ వల్ల 19 ఏళ్ల వయస్సులోనే 60 ఏళ్ల వృద్ధుడిలా అతడి ఊపిరితీత్తులు మారిపోయాయని డాక్టర్లు వెల్లడించారు.
 ఇటీవల మిస్సోరీలో 40 ఏళ్ల వ్యక్తి ఇ-సిగరెట్ తాగి చనిపోయాడు.  అతడి ఊపిరితీత్తుల్లోకి ప్రవేశించిన పొగ బయటకు రాకపోవడంతో అతడి గుండె ఆగింది.  అమెరికాలో ఇప్పటివరకు సుమారు 530 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని, మరో 8 మంది చనిపోయారని గణంకాలు వెల్లడించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: