బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ ష్టాపబుల్’ సీజన్ 2 లో చిరంజీవి ముఖ్య అతిధిగా ఆ కార్యక్రమంలో పాల్గొంటే చూడాలని లక్షలాది మంది ఆశిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే అల్లు అరవింద్ ప్రయత్నాలు కూడ జరుగుతున్నాయి. అయితే ఈ షోలో చిరంజీవి బాలకృష్ణలు కలిసి ఎప్పుడు సందడి చేస్తారు అన్న విషయమై క్లారిటీ లేకపోయినా ఎదో ఒకరోజు ఆ ఎపిసోడ్ ఉంటుంది అన్న సంకేతాలు ‘ఆహా’ నుంచి వస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి నటించిన ‘వాల్టేర్ వీరయ్య’ అలాగే బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సంక్రాంతికి ఒక దానిపై ఒకటి పోటీగా విడుదల అవుతున్నాయి. దీనితో చాల సంవత్సరాలు తరువాత చిరంజీవి బాలకృష్ణల సంక్రాంతి వార్ కు రంగం సిద్ధం అయింది.


ఈ రేస్ లో ఎవరు సంక్రాంతి విజేత అన్న విషయమై ఇప్పటికే అంచనాలు మొదలైపోయాయి. ఇలాంటి పరిస్థితులలో చిరంజీవి నోటి వెంట బాలయ్య సినిమా ప్రమోషన్ బాలకృష్ణ నోటివెంట చిరంజీవి సినిమా ప్రమోషన్ జరిగితే అది ఒక సంచలనం అవుతుంది. ఇప్పుడు అలాంటి సంఘటనకు ఆహా వేదిక కాబోతోంది అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ రెండు సినిమాలను నిర్మిస్తున్నది ప్రముఖ నిర్మాణ మైత్రీ మూవీస్ కావడంతో వారికి బాలకృష్ణ చిరంజీవిల తో ఉన్న సాన్నిహిత్యంతో వారిద్దరిని ఈ ప్రమోషన్ కు ఒప్పించి రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


డిసెంబర్ చివరి వారంలో ఆహా లో చిరంజీవి బాలకృష్ణలు కలిసి పాల్గొనే షో రికారింగ్ జరుగుతుందని చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చే ఆషోలో చిరంజీవి బాలయ్యలు చాల ఉల్లాసంగా పాల్గొంటూ సంక్రాంతికి రాబోతున్న తమ రెండు సినిమాలను హిట్ చేయమని తెలుగు ప్రేక్షకులను కోరుకుంటూ తామిద్దరూ ఒక్కటే అన్న సంకేతాలు ఇవ్వబోతున్నట్లు టాక్. ఈ వార్తలే నిజం అయితే ఈ ఎపిసోడ్ కు రేటింగ్స్ జాతీయ స్థాయిలో రికార్డులు బ్రేక్ చేస్తుంది అనడంలో సందేహం లేదు..




మరింత సమాచారం తెలుసుకోండి: