మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీ లీల ... పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... జయరామ్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ఈ మూవీ యొక్క షూటింగ్ కొంత భాగం పూర్తి అయ్యింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని దర్శకుడు త్రివిక్రమ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లస్ ఫ్యామిలీ ఎమోషన్ మూవీ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా యొక్క షూటింగ్ ను ఎస్ ఎస్ ఎం బి 28 అనే టైటిల్ తో ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క టైటిల్ ను మే 31 వ తేదీన చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి ఇప్పటికే ఒక టైటిల్ ను మూవీ యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి "అమరావతి కి అటు ఇటు" అనే టైటిల్ ను పెట్టే ఉద్దేశంలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ... ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఇదే టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన రెండు మూవీ లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ పై మహేష్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: