టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యువ దర్శకుడు అనిల్ రావపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ కేరళలో జరుగుతుండగా, తదుపరి షెడ్యూల్ ని హైదరాబాద్ లో నిర్వహించనున్నారని, అలానే ఈ షెడ్యూల్ లో సినిమాలో కీలకమైన రెండు సాంగ్స్ ని ప్రత్యేక సెట్స్ లో చిత్రీకరించనున్నారని సమాచారం. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయశాంతి గారు చాలా ఏళ్ళ తరువాత టాలీవుడ్ సినిమాల్లోకి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. 

 

ఇక అతి త్వరలో ఈ సినిమా టీజర్ మరియు సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ కాబోతున్నాయి. మురళి శర్మ, రాజేంద్ర ప్రసాద్, సంగీత, బండ్ల గణేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇకపోతే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని భావించిన ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఒక రోజు ముందుకు జరిపి, జనవరి 11న ఫిక్స్ చేసినట్లు నేడు పలు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే దీనికి ఒక ప్రధాన కారణం ఉందట. 

 

అదేమిటంటే, సరిగ్గా అదే రోజున బన్నీ, త్రివిక్రమ్ ల అలవైకుంఠపురములో సినిమా రిలీజ్ కూడా ఉండడంతో, నిన్న ఆ సినిమా యూనిట్ తో కొంత చర్చించిన తరువాత ఫైనల్ గా తమ సినిమాను ఒక రోజు ముందుగా రిలీజ్ చేయాలని నిర్ణయించిందట సరిలేరు యూనిట్. అలా కనుక చేస్తే రెండు సినిమాలకు కూడా ఫస్ట్ డే ఓపెనింగ్స్ బాగా వస్తాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక ఈ రెండు సినిమాల డేట్స్ విషయమై కొందరు టాలీవుడ్ ప్రముఖులు కూడా మధ్యవర్తిత్వం వహించారని అంటున్నారు. కాగా నేడు విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై సరిలేరు సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: