గత ఏడు సంవత్సరాలుగా ఎదురులేని కామెడీ షో గా జబర్దస్త్ కొనసాగుతుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఎన్నో ఛానెళ్ల కామెడీ షోలు దీనికి దీటుగా నిలబడాలని ప్రయత్నించినా.. అవి ఘోరంగా విఫలమై అడుగంటి పోయాయి. మరి ఇంత బలంగా జబర్దస్త్ కామెడీ షో కొనసాగడానికి కారణం ఎవరయ్యా? అని ప్రశ్నిస్తే... జబర్దస్త్ క్రియేటివ్ హెడ్స్ తో పాటు ఆ షోకి న్యాయనిర్ణేతలైనా నాగబాబు, రోజా అని నిర్మొహమాటంగా చెప్పుకోవచ్చు. నాగబాబు దర్శకత్వంలో కామెడీ స్కిట్లు మరింత హాస్యభరితంగా మారుతూ వచ్చాయన్న మాట వాస్తవమే. మరోవైపు రోజా నవ్వులతో జబర్దస్త్ షోకి బాగా కళ వచ్చింది. దీంతో ఈ షో కనులవిందుగా, హాస్యభరితంగా, దిగ్విజయంగా కొనసాగుతూ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. కానీ జబర్దస్త్ లో నుండి ఎప్పుడైతే నాగబాబు వెళ్ళిపోయారో... ఆ రోజు నుండి రోజా పెత్తనం కొనసాగించడం ప్రారంభించింది.


మరీ గత కొన్ని రోజులుగా జబర్దస్త్ స్కిట్లు నడుస్తున్నప్పుడు... రోజా ముందుగానే కమెడియన్ల డైలాగులను చెప్పేసి వాటిని పాడు చేస్తుంది. దీంతో కమెడియన్లు ఆమెను ఏమనలేక తమ స్కిట్టు కంటిన్యుటీ తప్పి నానా తిప్పలు పడుతున్నారు. స్కిట్లు నడుస్తున్న సందర్భంలో రోజా టూ మచ్ గా పంచులు వేయడంతో.. స్కిట్ ని చూపించాలో లేకపోతే రోజాని చూపించాలో తెలియని సందిగ్ధంలో కెమెరామెన్లు కూడా పడిపోతున్నారు.



దీంతో ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న హైపర్ ఆది ఆమెకు తన స్కిట్ లో ఓ చిన్న పాత్ర ఇచ్చాడు. స్కిట్ లో భాగంగా రోజా ని ఒక కుర్చీలో కూర్చోపెట్టి ఆ కుర్చీకి ఆమె చేతులు కట్టేసి.. 'స్కిట్ మధ్యలో మీరు కౌంటర్లు వేస్తున్నారు. మాకు బిపి పెరుగుతుంది. అందుకే మిమ్మల్ని ఇలా కట్టేసి.. మేము వేస్తున్నాం ఇప్పుడు', అంటూ రోజా ప్రవర్తనపై పరోక్షంగా పంచులు వేసాడు. కానీ రోజా మాత్రం అది అర్థం కాక.. ఆది రాసిచ్చిన డైలాగులను చిలక లాగ చెప్పేస్తుంది. ఇదంతా జరిగి పోయిన తర్వాత కూడా ఆమె ధోరణిని మార్చుకోకుండా అదేవిధంగా స్కిట్ల మధ్యలో కౌంటర్లు వేస్తూ.. అందరి కమెడియన్ల పర్ఫామెన్స్ ని నాశనం చేస్తుంది. ఈ విధంగా స్మైలింగ్ బ్యూటీ రోజా జబర్దస్త్ కు శాపంగా మారిందని చాలామంది చెవులు కొరుక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: