వెండితెర మీద కలిసి నటించిన కొన్ని జోడిలు ఆడియన్స్ను మెస్మరైజ్ చేస్తాయి. తెర మీద ఆ జంట కెమిస్ట్రీ చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటుంది. అందుకే అదే కాంబినేషన్లో మరో సినిమా వస్తే బాగుండని ఎదురుచూస్తుంటారు ఆడియన్స్. అలాంటి జంటలు ఇండియన్ స్క్రీన మీద చాలానే ఉన్నాయి.
ఈ లిస్ట్లో ముందుగా చెప్పుకోవాల్సిన జోడి నాగచైతన్య, సమంత. తెలుగులో ఈ జంటకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తొలి సినిమా ఏం మాయ చేసావేతోనే మాయ చేసిన ఈ జోడి తరువాత మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ సినిమాల్లో కలిసి నటించింది. తెర మీదే కాదు తెర వెనుక కూడా బెస్ట్ జోడి అనిపించుకున్న ఈ జంట మరోసారి తెర మీద కనిపిస్తే చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. పెళ్లి తరువాతే మజిలీ సినిమాలో కలిసి నటించిన ఈ జంట, మంచి కథ దొరికితే మరోసారి నటించేందుకు కూడా సై అంటున్నారు.
తెర మీద రొమాన్స్ పండించటంలో బెస్ట్ అనిపించుకున్న బాలీవుడ్ జోడి హృతిక్ రోషన్, కత్రినా కైఫ్. జిందగీ న మిలేంగి దుబారా సినిమాలో తొలి సారిగా కలిసి నటించిన ఈ జంట, బాలీవుడ్లో ది బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్స్ సరసన నటించింది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్లో ఈ జంట పర్ఫామెన్స్, చలికాలంలో కూడా సెగలు రేపుతుంది. తరువాత అగ్నిపథ్, బ్యాంగ్ బ్యాంగ్ సినిమాల్లో కలిసి నటించిన ఈ జోడిని మరోసారి తెర మీద చూసేందుక అభిమానులు ఎదురుచూస్తున్నారు.
వీళ్లే కాదు షాహిద్ కపూర్ - అనుష్క శర్మ, రణబీర్ కపూర్ - కత్రినా, హృతిక్ - ఐశ్వర్య, ఆమిర్ ఖాన్ - నయనతార ఇలా వెండితెర మీద రొమాన్స్ పండించటంలో బెస్ట్ అనిపించుకున్న జోడిలు చాలానే ఉన్నాయి. వారందరినీ మరోసారి చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తూనే ఉంటారు.